Friday 2 September 2016

దర్మేచ ,అర్దేచ ,కామేచ ,మోక్షేచ నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,మోక్షేచ నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు.
అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. అందరకు మాదిరే వివాహమ్ చేసుకున్నాడు. కొంత కాలం వారి కాపురం సజావుగా సాగిందనడానికి ఆనవాలుగా వారికి పిల్లలు కలిగారు. ఆ తర్వాత బార్యకి భర్త అంటే మొహం మొత్తింది కాబోలు, గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి పోయింది. పాపం ఆ భర్త పెద్ద మనుషుల ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్సాడు. అవ్వన్నీ విపలమయ్యాయి. చివరకు చేసేదేమి లేక, మరో మనువు ఊసెత్తకుండా, తన పిల్లలకు తల్లి, తండ్రి అన్నీ తానే అయి పెంచి పెద్ద చేసి విద్యా బుద్దులు చెప్పించాడు.అలా ఇరవై మూడేళ్లు గడిచాయి.
మొన్నీ మద్య ఆయనకి బార్య పుట్టింటి తరపు నుంచి కబురు వచ్చింది. ఆయన గారి బార్య చనిపోయిందని, చివరి చూపు చూడాలనుకుంటె రమ్మని పిలిచారట. ఆయన ఒక హిందూ భర్తగా తన ధర్మం ప్రకారం అత్తవారింటికి వెళ్ళి, తన భార్యను తన ఊరిలోనే దహన సంస్కారాలు నిర్వహించి, తన చేతితోనే కర్మ కాండ జర్పుతాను అని చెప్పేసరికి అత్తవారింటి వారు అవాక్కయారట!ఎప్పుడొ ఇరవై మూడేళ్ళ క్రితం కట్టుకున్న మొగుడిని, కన్న బిడ్డలను వదలి వచ్చేసిన ఆ భార్య కాలేని భార్య చనిపోతే ఆమె మీద ప్రేమతో కూడిన బాద్యతను నెరవేర్చడానికి తయారైన ఆ భర్తలోని ధర్మ పరాయణత్వం చూసి అబ్బుర పడ్డారు ఇరు గ్రామాల ప్రజలు. అందరి అంగీకారంతో ఆమెకు కర్మ కాండ పూర్తి చేసాడు ఆ భర్త.
తాళి కట్టిన దానితో కాపురం చేస్తూ, చిన్న ఇళ్ళ ఏర్పాటు కోసం వెంపర్లాడే మగ మహా రాజులు ఉన్న ప్రస్తుత సమాజంలో, పెండ్లి నాటి ప్రమాణానికి కట్టుబడి, ఒకే మాట,ఒకే భార్య అనే శ్రీ రాముని ధర్మాచరణాన్ని ఆచరించి చూపిన అతను నిజంగా ధన్యజీవి. చీటికి మాటికి కొట్లాడుకుంటూ, చిన్న చిన్న సమస్యలనే పెద్ద,పెద్ద బూతద్దాలలో చూస్తూ, విడాకులు తీసుకునే ఆలుమగలు ఒక మాట గుర్తుంచుకోవాలి మొట్ట మొదటగా ఎవరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి వివాహా మాడుతున్నారో వారితోనే జీవన సాపల్యం పొందడం గొప్ప అద్రుష్టం. వారి పిల్లలలొ ఉండె భద్రతాబావం, విడాకులు పొంది విడిగా ఉండే వారి పిల్లలో ఉండదు.

ఎవరికిష్టమైన జీవితం వారనుభవించే హక్కు భారత రాజ్యాంగం ప్రసాదించి ఉండవచ్చు .కానీ భార్యా భర్తలకు ఉండే స్వేచ్చాజీవిత హక్కుల కన్నా పిల్లల సహజ హక్కులైన తల్లితండ్రులతో కలసి ఉండడం అనేది ముఖ్యమైనది. కాబట్టి సాద్యమైనంతవరకు సర్దుకు పోయే గుణంతో సంసారాలను సాగించి పిల్లల సహజ హక్కును పరిరక్షించడం ప్రతి తల్లి ,తండ్రి కనీస ధర్మం . కాదని విడిపోయే వారి పిల్లలు అంత దురద్రుష్ట వంతులు ఈ లోకం లో ఎవరూ ఉండరు.పిల్లల మీద నిజంగా ప్రేమ ఉన్న వారైతే, ఆ పిల్లల తల్లి, లేక తండ్రి చేసే తప్పులను కూడా క్షమించే అంత సహనం కలిగి ఉంటారు. పై ఉదంతంలోని విషయమే తీసుకోండి. ఆ భర్త కి భార్యని భార్యగా చూడాల్సిన అవసరం లేనప్పటికి తన పిల్లలకు జన్మ నిచ్చిన తల్లిగా ఆమెను గౌరవించాడు. అ గుణమే ఆయనకు,అయన పిల్లలకు శ్రీ రామ రక్ష.

"విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ?

ఈ మద్య కొందరు పని కట్టుకుని హిందూ జీవన విదానం లోని "విగ్రహారాదన" మీద విగ్రహారాదకుల తమ ఆగ్రహం వెళ్ళగ్రక్కుతున్నారు. ప్రపంచంలోని ఎడారిలో పుట్టిన ఎడారి మతాలూ , వారి ఆరాధన పద్దతులు మీద మక్కువ కలిగిన కొందరు , పచ్చని బారత భూమిలో ఉద్బవించిన మతాలు--శైవం, వైష్ణవం , శాక్తేయం, సాయిబాబీయమ్,శాక్తేయం-- కు సంబందించిన ఆరాధన పద్దతులను తప్పు పడుతూ , విగ్రహారాదన అనేది జ్ఞానులు బగవంతుని గురించి తెలుసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగ పడదని, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానమార్గమైన "ఉపాసన మార్గం "ఒక్కటే కరెక్టు అని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి వారు బోల్డన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవ్వన్నీ సహేతుకమైనవే అని అనిపిస్తుండడం వలన, కొంత మంది ఆ ప్రబోదకుల మాయలో పడి డోలాయమాన స్తితిలో ఉన్నారు. మరి వారు చెప్పేది అలా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు విగ్రహారాదనకు వ్యతిరేకమని, అయన చెప్పబట్టే ఎడారి మతాల్లో విగ్రహారాదన లేకుండా పోయిందని , అందుకే అయన విశ్వ గురువు అయ్యాడు అని, విగ్రహరాదనను అయన సమర్దించి ఉంటె కేవలం "భరత గురువు " మాత్రమే అవుతాడని గడుసు వాదనలు చెయ్యటం మొదలు పెట్టారు .
అసలు ఈ ఎడారి మతస్తులకు శ్రీ కృష్ణ బగవానుడికి విశ్వ గురువు ముద్ర వేసి , అయన విగ్రఃఅరాదనను ఖండించారు అని ,దానినే తమ మతస్తులు పాలో అవుతున్నారని,అసలు వేదాల్లో చెప్పింది తమ ప్రవక్త గురించే అని తెగ ఊదరగొడుతూ , మోకాలికి బట్టతలకు ముడి వేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు ?. తాము అనుసరిస్తుంది వేద మతం లో చెప్పినదే కాబట్టి ఇండియాలోని హిందువులంతా తమ పద్ధతినే అనుసరించమని పదే పదే చెబుతుండడం వెనుకాల ఏదైనా మతలబ్ ఉందా అని ఆలోచిస్తే రోజు ఈనాడు పేపర్లో రాసిన ఒక విషయం నన్ను ఆకర్షించింది. సదరు విషయానికి , ఈ బ్లాగ్ ప్రవక్తల రీపిటడ్ ప్రచారాలకు సంబందం ఉన్నట్లే కనిపిస్తుంది.
పై సమాచరం ప్రకారం 2020 నాటికి భారత దేశం లో కూడా ఖలీఫా రాజ్య స్తాపనే ఎడారి మతస్తుల పరమోద్దేశ్యం . కేవలం 5 సంవత్సరాలలో కోట్లాది మంది ప్రజలను తమ మతానికి అనుగుణంగా మార్చాలి అంటె , భారత దేశం లోని మెజార్తీ మతస్తుల మనోబావాలను డైరెక్టుగా గాయపరచే చర్యలు మానుకోవాలి అని వారు బావించి ఉండవచ్చు. . హిందువుల దేవుళ్ళను మెచ్చుకూంటూ , వారి ఆరాధన పద్దతులను నిరసిస్తూ . ఇవ్వన్ని స్వార్ధపరులైన కొంతమంది హిందూ పండితుల కుట్ర అని ప్రచారం చేసి యువతను తమ ఆరాధనా పద్దతుల పట్ల ఆకర్షితులు అయ్యేలా చేస్తే, ఆ తర్వాత వారిని పూర్తిగా తమ ప్రబావానికి గురి చేయవచ్చు. హిందూ మతాలకు . ఎడారి మతానికి ముఖ్య బేదం విగ్రహరాదన . ఎడారి మతస్తులు దేనినైనా ఒప్పుకుంటారు కాని , విగ్రహారాదన ఒప్పుకోరు. విగ్రహారాదన ఉన్నంత కాలం హిందు దేశం లో తమ పప్పులు ఉడకవు. కాబట్టే విగ్రఃహారాదనను అజ్ఞాన పూజా పద్దతిగా ముద్ర వేసి ,యువతను దాని నుండి దూరం చేస్తే , తమ రాజ్య స్తాపన సులువు అవుతుంది. ఇదే ఉద్దేశ్యం తో కొన్ని సంస్తలు చెసే ప్రచారం లో బాగమే "విగ్రహారాదన " పై విమర్శలు కావచ్చు. .
పై విషయం సంగతి కాసేపు అటు ఉంచి , అసలు మన దేశం లోని దైవ ఆరాధన పద్దతులు గురించి ఆలోచిద్దాం. హోందూ జీవన విదానం లో బగవంతుని దర్శించే మార్గాలులో భక్తీ మార్గం , జ్ఞాన మార్గం రేండూ ఉన్నాయి.భక్తీ మార్గం లో విగ్రహరాదన ఉంటె , జ్ఞాన మార్గం లో దాని అవసరం లేక పోవచ్చు. కాని భగవత్ దర్సనం అనేది వ్యక్తీ గతం గా ఎవరికీ వారే తెలుసుకోవాలి తప్పా , ఎవరో కొంత మంది దర్శనం పొందినంత మాత్రానా , తతిమ్మా వారు పొందాల్సిన అవసరం లేదని మన రుషులు చెప్పలేదు. ఒక వేల ఎడారి మతస్తులు చెపుతున్నట్లు అజ్ఞాన దశ లోనే "విగ్రాహారదన " అవసరం అనుకుంటే బగవంతున్ని నిజ దర్సనం పొందే జ్ఞానుల సంఖ్య ఎంత ? దాని గురించి సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే గీత లో సెలవు ఇచ్చారు . "వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానశక్తి ప్రయత్నించును, అట్లు ప్రయత్నించిన వారిలో ఒకా నొకడు మాత్రమే నన్ను యదార్దముగా తెలుసుకోగలుగుతున్నాడు" . మరి అయన చెప్పిన దాని ప్రకారమే దైవం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే జ్ఞానుల సంఖ్య బహు స్వల్పమ్. వారికి మాత్రమే విగ్రాహారదన అవసరం లేదు. మిగతా వారందరికి అవసరమే కదా!
విగ్రహారాదన చెయ్యకుండా , కేవలం మేమే జ్ణానులమని అపోహపడుతూ , రోజుకి 4,5 సార్లు వంగుని లేచినంత మాత్రానా వారికి నిజ దైవ దర్సనం కలుగుతుంది అనుకోవడం బ్రమే . విగ్రఃహారా దన అవసరమా ,వద్దా అనేది ఆరాదకుడు తన మానసిక స్తాయి ననుసరించి నిర్ణయించుకూంటాదు. దానికి వేరే మతస్తుల జ్యోక్యం అనవసరం. విగ్రాహరదనను వ్యతిరేకించడం అంటే హిందు మతాల ఆరాధనా పద్దతులను అవమాన పరచడమే .
హిందూ మతాల పద్దతులులో చాలా వరకు శాస్త్రీయ దోరణులు ఉన్న్నయి. అది సైన్స్ కి వ్యతిరేకం కాదు. శ్రీ కృష్ణుడి కాలం నాటికి , ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి . వాటికి అనుగుణంగా హిందూ జీవన విదానం లో మార్పులు సూచించడానికి మహాత్ములు పుడతారని , వారే అవతార పురుషులని ఈ గడ్డ మీద పుట్టిన మతాల నమ్మకం. వేరే మతాల లాగా ఒక్కరి తో పుట్టి వారి తోనే అంతం కాదు హిందూ జీవన విదానం. శ్రీ కృష్ణుడు కాలం నాటికి తెలుసుకున్న జ్ణానానుసారo అయన ప్రబోదిస్తే , ఈ నాటి జ్ణానా నుసారం "కల్కి అవతారుడు ప్రబోదించవచ్చు.దానికోసమే దశావతారాలు , 14 మంది మనువులు అని చెప్పింది. వారే సరి చేస్తారు, కాలంతరం వలన సమాజం లో కలిగే దోషాలను. అంతే కాని ఎడారిలో పుట్టిన మతాలుకు సంబందించిన వారు, , అసలు భారత దేశం గురించి తెలియని వారు ప్రబోదింస్తే వాటిని పాలో కావాల్సిన దుర్గతి హిందువులకు లేదు కాక లేదు.
చివరగా ఒక్క విషయం చెపుతాను . ప్రస్తుత యుగం సైంటిఫిక్ యుగం. సైంటిఫిక్ దియరి అనుసారం , విశ్వం మొత్తం అణువుల మయం అని , ప్రతి అణువు ఎలక్ట్రాన్ లు, ప్రోటాన్ లు , న్యూట్రాన్ లు నిర్మితమని , కాబట్టి చెట్టులో గట్టులో , పుట్టలో , ఇది రాస్తున్న నాలో, చదువుతున్న మీలో అందరిలో , విశ్వం అంతటా వ్యాపించి ఉంది అణువులే కదా . దాని ప్రకారం విగ్రహం వేరు, దేవుడు వేరు ఎలా అవుతారు ? విగ్రహం లో ఏముందో విశ్వం అంతటా అదే ఉంది. ఆ జ్ఞానం తెలుసుకుంటే శుష్క వాదనలు చేయడం ఎందుకు? "ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లు అవుతుందో" అదే బ్రహ్మ జ్ణానమ్. మన అందరిలో ఉన్నది ఒకటే అని చాల మందికి తెలుసు. కాని వారు కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండలేక పోతున్నారు అంటే కారణం , మాయ!!
అవును మాయే ! బ్రహ్మ జ్ఞానం తెలిసినంత మాత్రానా బ్రహ్మ జ్ణానిగా ఉండలేరు. ఎందుకంటె ఆ జ్ఞానాన్ని నిరంతరం మాయ కప్పేస్తూ ఉంటుంది. దాని వలననే నీవు వేరు, దేవుడు వేరు అనే బావన. తనలో ఉన్న దేవుడిని కనుగొనడానికి ఎక్కడికో యాత్రలకు వెళ్లి అక్కడి రాళ్ళను రాళ్ళతో కొట్టడం , ఇక్కడి కొచ్చి విగ్రహారాదన వేస్ట్ అనడం. నిజమైన బ్రహ్మ జ్ఞాని గా మిగలాలి అంటె నిరంతరం ప్రకృతిని తన యందును , తనను ప్రకృతి యందును చూచుకుంటు , తన ప్రక్రుతి ధర్మం తానూ నెరవేర్చి చివరకు ప్రకృతిలో ఐక్యమై పోవడమే.
ఎవరి తోచిన పద్దతిలో వారు భగవంతున్ని ఆరాదించుకోడం లోనే నిజమైన అలౌకిక ఆనందం ఉంది . అటువంటి ఆనందానికి అరాదకులను దూరం చేసే పనికి రాని వాదనలు ప్రస్తుత తరుణం లో అనవసరం విగ్రహం లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకున్న నాడు వాదనలకు ఆస్కారం ఉండదు.